Telugu Gateway
Top Stories

కోర్టు ను ఆశ్రయించే యోచనలో రాడిసన్ !

కోర్టు ను ఆశ్రయించే యోచనలో రాడిసన్ !
X

ప్రధాని నరేంద్ర మోడీ ఏంటి...హోటల్ బిల్ బాకీ పడటం ఏంటి అనుకుంటున్నారా?. నిజమే ఈ వార్త ఎవరికైనా ఆశ్చరం కలిగించకమానదు అనే చెప్పాలి. కానీ ఇది నిజం. ప్రధాని నరేంద్ర మోడీ గత ఏడాది 2023 సంవత్సరం ఏప్రిల్ లో మైసూర్ లోని రాడిసన్ బ్లూ ప్లాజా లో బస చేశారు. నేషనల్ టైగర్ కన్సర్వేషన్ అథారిటీ ( ఎన్ టిసిఏ) ఏర్పాటు చేసిన టైగర్ ప్రాజెక్ట్ 50 వ వార్షికోత్సవానికి ఆయన హాజరై ఈ హోటల్ లో బస చేశారు. ఎన్ టిసిఏ, కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ సంయుక్తంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాయి. మూడు కోట్ల రూపాయలు మంజూరు చేస్తామని ...ఈ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా కర్ణాటక అటవీ శాఖను కోరారు. అత్యవసర ఆదేశాల మేరకు పనులు చేయటంతో ఖర్చు కాస్తా 6 .33 కోట్ల రూపాయలకు పెరిగింది.

కర్ణాటక అటవీ శాఖ పలు మార్లు కేంద్రాన్ని కోరినా ముందు చెప్పిన మూడు కోట్లు విడుదల చేసి ..మిగిలిన నిధులు మాత్రం విడుదల చేయలేదు. మరో వైపు ముందు చెప్పిన తరహాలో కాకుండా కార్యక్రమంలో మార్పులు చేయటంతో నిర్వహణ సంస్థ చార్జీలు పెంచిన విషయాన్నీ వీడియో కాన్ఫరెన్స్ లో అధికారులకు వివరించారు కూడా. దీంతో హోటల్ యాజమాన్యం ఎన్నిసార్లు రిమైండర్లు పంపినా కూడా ఇప్పటివరకు బిల్ సెటిల్ చేయలేదు. ఈ విషయాన్నీ హిందూ పత్రిక వెలుగులోకి తేవటంతో ఈ విషయం ఇప్పుడు పెద్ద సెన్సేషన్ గా మారింది. ఇప్పుడు హోటల్ యాజమాన్యం బిల్స్ కోసం కోర్ట్ ను ఆశ్రయించే ఆలోచనలో ఉన్నట్లు ఈ పత్రిక వెల్లడించింది.

Next Story
Share it