Telugu Gateway
Top Stories

అమిత్ షా హెలికాఫ్టర్ దిగనివ్వలేదు..రాష్ట్రాలు శక్తివంతం

అమిత్ షా హెలికాఫ్టర్ దిగనివ్వలేదు..రాష్ట్రాలు శక్తివంతం
X

అసలు పవన్ కళ్యాణ్ ఏమి చెప్పదలచుకున్నారు

అమరావతి విషయంలో బిజెపిని వెనకేసుకొచ్చేందుకు తిప్పలు?

అధికారంలో ఉన్న వారు చాలా శక్తివంతంగా ఉంటారు. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీ ప్రభుత్వం కేంద్ర హోం మంత్రి అమిత్ షా హెలికాప్టర్ ను కూడా దిగనివ్వలేదు. చివరకు కేంద్రం పరిధిలో ఉండే ప్రాంతంలో ఆయన హెలికాప్టర్ దింపుకున్నారు. బిజెపి అమరావతికి అనుకూలమే కానీ.. కేంద్రం జోక్యం చేసుకోలేదు. చెప్పలేదు. తొలుత అమరావతిని నిర్ణయించినప్పుడు కూడా జోక్యం చేసుకోలేదు. జనసేన, బిజెపిలు అమరావతి కోసం కట్టుబడి ఉన్నాయి. సీఎం జగన్ కూడా గతంలో అమరావతికి అంగీకరించారు. ప్రభుత్వం మారిన వెంటనే రాజధాని మార్చటం ఏ మాత్రం సరికాదు. ఇవీ జనసేనాని వ్యాఖ్యలు. పవన్‌కళ్యాణ్‌ను మంగళవారం నాడు అమరావతి రైతులు, మహిళలు కలిశారు. భూములు ఇచ్చి మానసిక క్షోభ అనుభవిస్తున్నామని మహిళలు కన్నీరు పెట్టారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ . 'ఎప్పుడూ బయటకు రాని ఆడవాళ్లు రోడ్లపైకి వచ్చారు. లాఠీఛార్జ్‌ లు, బేడీలను భరిస్తూ ఉద్యమం చేస్తున్నారు. దళితుల పైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టే స్థాయికి‌ వైసీపీ ప్రభుత్వం దిగజారింది.

ఎంతోమంది మహిళలు తమ పుట్టింటి కానుకగా భూములు తెచ్చుకుని ఉంటారు. అటువంటి పొలాలను కూడా రాజధాని‌ కోసం త్యాగం చేశారు. ఏ ప్రభుత్వం మారినా గత ప్రభుత్వాల విధానాలను అమలు‌ చేయాలి. 2014లో జగన్ అమరావతికి అంగీకారం తెలిపారు. అప్పుడు వ్యతిరేకంగా ఉంటే..‌ మీరు‌ భూములు ఇచ్చే వారు కాదు. నేను రైతు పక్షపాతిని.. నాకు రైతుల కష్టం, భూమి విలువ నాకు తెలుసు. ఎస్ఇజెడ్‌ల పేరుతో గతంలో కూడా రైతుల భూములను లాక్కున్నారు. 29వేల మంది రైతులు భూములు ఇస్తే.. ఇప్పుడు కులాలు, రాజకీయాలు అంటగడుతున్నారు. మీ భూములు మీకు ఇవ్వడానికి అవి ఎక్కడ ఉన్నాయో కూడా చెప్పలేని స్థితిలో రోడ్లు‌ వేశారు. గుంటలు తవ్వారు.. ఈ పరిస్థితిలో ప్రభుత్వం ఎలా మారుస్తుంది. ఆనాడు కులం, పార్టీ లేని జగన్‌కు ఇప్పుడు అవే కనిపిస్తున్నాయా?' అని ప్రశ్నించారు.

'అమరావతి ఉద్యమం మహిళలే ముందుండి నడిపిస్తున్నారు. నేను మీ వెనుకే... మీ వెంటే ఉంటాను. అండగా నిలుస్తాను. అమరావతి ఉద్యమానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది. ఎప్పుడు అవసరమైనా... జనసేన మీతో కలిసి నడుస్తుంది. నాకు ఓట్లు వేయకపోయినా... నేను ధర్మం వైపు నిలుస్తాను. రాజధాని అమరావతి అని అందరూ చెప్పారు. రాజధాని ఇక్కడే ఉంటుందని నేను బలంగా నమ్ముతున్నాను. బీజేపీతో కలిసి పొత్తు పెట్టుకున్న సమయంలోనే అమరావతి రాజధానిగా నిర్ణయించాం. బీజేపీ నేతల వ్యాఖ్యలు గందరగోళంగా ఉన్నా.. అమరావతిలో‌ వారు కూడా క్లారిటీగా ఉన్నారు. వ్యవస్థలలో ఉన్న ఇబ్బందులు వల్ల.. కేంద్రం అన్ని అంశాలలో జోక్యం చేసుకోదు. బీజేపీ రాష్ట్ర పార్టీ నిర్ణయానికి కేంద్ర నాయకత్వం కట్టుబడి ఉంటుంది. మీకు చెప్పే విధానం నచ్చకపోయినా...‌ అమరావతి ఇక్కడే అనేది నిజం. ఇందులో ఎటువంటి తేడా జరిగినా...‌మీకు అండగా నేను పోరాడతా' నంటూ పవన్ కళ్యాణ్ తెలిపారు.

Next Story
Share it