ముంబై విమానాశ్రయం ప్రధాన రన్ వే సురక్షితం కాదు !

కానీ ఇక్కడ తప్పును మాత్రం చనిపోయిన పైలట్ ల మీద నెట్టేసి కొరుకున్నారు అని ఆరోపించారు. విమానాశ్రయంలోని లోపాల గురించి ఫిర్యాదు చేయటంతో ఆమెను ఎయిర్ పోర్ట్స్ ఆథారిటీ అఫ్ ఇండియా (ఏఏఐ) వేటు వేసింది. అయినా ఆమె రన్ వే సేఫ్టీ అంశంపై తన పోరాటం కొనసాగిస్తున్నారు. చాలా సార్లు సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఎలాంటి ఉపయోగం లేకుండా పోయింది అని తెలిపారు. ఎయిర్ పోర్ట్ నుంచి టేక్ ఆఫ్, లాండింగ్ మార్గాల్లో వస్తున్న భవనాలకు అనుమతుల విషయం లో పెద్ద ఎత్తున ఉల్లంఘనలు జరుగుతున్నాయని తెలిపారు. బాంబే హై కోర్ట్ లో దీనిపై లాయర్ ఒక ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేయగా. ఆమె అన్ని విశయాలనూ కోర్ట్ ముందు ఉంచారు. దీంతో ఆమెపై వేటు పడింది. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆమె ఈ సంచలన విషయాలను బహిర్గతం చేశారు. .