Telugu Gateway
Top Stories

మోడీ సర్కారు విశ్వసనీయతపై మరక

మోడీ సర్కారు విశ్వసనీయతపై మరక
X

లక్షల దుర్వినియోగంపై దూకుడు..లక్షల కోట్ల రూపాయల అక్రమాలపై మాత్రం మౌనం. ఇది ప్రధాని మోడీ దగ్గరి నుంచి కేంద్ర పెద్దలు అనుసరిస్తున్న తీరు. ఒక్క రోజు అంటే ఒక ఒక్క రోజు అదానీ గ్రూప్ వికీపీడియా లో పెయిడ్ ఎడిటర్ల తో చేసిన మోసాలు, వ్యాసాల దిద్దుబాటు కు సంబంధించి ఈ సంస్థ కూడా అదానీ గ్రూప్ పై సంచలన ఆరోపణలు చేసింది. అసలే హిండెన్ బర్గ్ దెబ్బకు విలవిలాడుతున్న అదానీ గ్రూప్ పై వికిపీడియా ప్రభావం కూడా పడింది. దీంతో బుధవారం నాడే అదానీ గ్రూప్ కంపెనీల విలువ ఏకంగా 51 కోట్ల రూపాయల మేర తుడిచి పెట్టుకు పోయింది. దీనికితోడు మార్కెట్ సెంటిమెంట్ కూడా ప్రతికూలంగా ఉండటం తో అదానీ గ్రూప్ పై మరోసారి పెద్ద దెబ్బ పడినట్లు అయింది. అసలు దేశం లో వ్యవస్థలు సరిగా పని చేస్తుంటే అదానీ గ్రూప్ ఇలా చేయగలుగుతుందా?. ఏ మాత్రం సంబంధం లేని సామాన్య ఇన్వెస్టర్లు వేల కోట్ల రూపాయల మేర కళ్ళ ముందు అలా కోల్పోతుంటే మోడీ సర్కారు మౌనాన్ని మాత్రమే ఆశ్రయిస్తోంది. అదే సర్కారు ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఫీడ్ బ్యాక్ యూనిట్ లో 36 లక్షల రూపాయల దుర్వినియోగం జరిగినట్లు ఆరోపణలు ఉండటంతో ఆయన్ను విచారించేందుకు సిబిఐ కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 36 లక్షల రూపాయల దుర్వినియోగంపై ఇంత సీరియస్ గా ఉన్న కేంద్రం..లక్షల కోట్ల రూపాయల మేర జరిగిన అదానీ స్కాం పై మాత్రం ఎందుకు ఇంత వరకు ఒక్కటంటే ఒక్క కేసు కేసు కానీ....విచారణకు కానీ ఆదేశించటం లేదు.

సిబిఐ, ఈడీ లు వందల కోట్ల రూపాయల స్కాం లను సీరియస్ గా తీసుకుని విచారిస్తున్నాయి. ఇందులో తప్పు పట్టాలిసింది ఏమి లేదు. కానీ అదానీ విషయం లో మాత్రం ఎందుకు ఈ మౌనం అన్నదే ఇప్పుడు దేశం ముందు ఉన్న పెద్ద ప్రశ్న. ఢిల్లీ లిక్కర్ స్కాం పై చూపిస్తున్న స్పీడ్ అదానీ స్కాం పై ఎందుకు లేదు అన్నదే చర్చనీయాంశగా మారింది. లిక్కర్ స్కాం లో చేతులు మారిన ముడుపులు 100 కోట్లు గా చెపుతున్నారు. మొత్తం స్కాం విలువ..అదే ఖజానాకు వాటిల్లిన నష్టం మొత్తం కూడా సుమారు 2500 కోట్ల రూపాయలు. అదే అదానీ స్కాం విషయాన్ని వస్తే ఒక్క ఎల్ఐసి వంటి సంస్థే వేల కోట్ల రూపాయల మేర ఇప్పటికే నష్టపోయింది. ఇక ఇన్వెస్టర్ల సంగతి అయితే ఇక చెప్పక్కరలేదు. దేశంలో జరిగిన అది పెద్ద స్కాముల్లో ఇప్పుడు బయటపడిన అదానీ స్కాం ఒకటి అని అధికార వర్గాలు చెపుతున్నాయి. విదేశాల్లోని షెల్ కంపెనీలు...అక్రమ మార్గాల్లో నిధుల తరలింపు వంటి సంక్లిష్ట అంశాలు ఉన్న అదానీ స్కాం ను కేవలం నియంత్రణ సంస్థలకు వదిలేసి ఉరుకుంటే ఏమి జరుగుతుందో అందరికి తెలిసిందే. మరి సుప్రీమ్ కోర్ట్ ఈ విషయం లో ఎలాంటి డైరెక్షన్స్ ఇస్తుంది అన్నది ఇప్పుడు అందరిలో ఆసక్తి రేపుతోంది. కేంద్రం మాత్రం అసలు దీని విషయం ఎలాంటి చర్యలకు సుముఖంగా ఉన్నట్లు కనిపించటం లేదు.

Next Story
Share it