Telugu Gateway
Top Stories

సీజెఐగా ఎన్ వి రమణ..నోటిఫికేషన్ జారీ

సీజెఐగా ఎన్ వి రమణ..నోటిఫికేషన్ జారీ
X

సుప్రీంకోర్టు తదుపరి ప్రధాన న్యాయమూర్తిగా ఎన్.వి. రమణ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ నియామకానికి సంబంధించి రాష్ట్రప్రతి రామ్ నాథ్ కోవింద్ మంగళవారం నాడు నోటిఫికేషన్ జారీ చేశారు. ఏప్రిల్ 24న ఎన్. రమణ బాధ్యతలు స్వీకరించనున్నారు. కొద్ది రోజుల క్రితమే ప్రస్తుత సీజెఐ ఎస్ ఏ బోబ్డే ఆయన తర్వాత సీనియర్ గా ఉన్న ఎన్. రమణ పేరు ను కేంద్రానికి సిఫారసు చేయగా...కేంద్రం కూడా అన్నిలాంఛనాలు పూర్తి చేసి రాష్ట్రపతికి ఈ ప్రతిపాదన పంపింది. ఆయన ఆమోదంతో కేంద్ర ప్రభుత్వ లా అండ్ జస్టిస్ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది.

Next Story
Share it