ఏఐ..ఇక మీ మనసునీ చదివేస్తుంది అట !
త్వరలోనే ఈ సాంకేతిక నైపుణ్యంపై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. టెక్సాస్ యూనివర్సిటీ లోని న్యూరో సైన్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ విభాగంలో పనిచేస్తున్న నిపుణులు దీనిపై పని చేస్తున్నారు. ఏఐ రంగంలో ఇదే గొప్ప ముందడుగుగా వీరు దీన్ని చెపుతున్నారు. ఇదే అంశంపై ఒక పరిశోధన పత్రాన్ని ఇప్పటికే ఒక జర్నల్ లో ప్రచురించారు కూడా. యూనివర్సిటీ కి చెందిన నిపుణల బృందం ముగ్గురు వ్యక్తులకు 16 గంటలు వివిధ రకాల అంశాలు చెప్పి కొన్ని పదాలకు వారి నాడులు స్పందించిన తీరును పరిశీలించారు. దీనికోసం చాట్ జీపీటి తరహాలో జీపీటి ఏఐ ని వాడారు. దీని ఆధారంగా ఆ వ్యక్తులతో మాట్లాడి పరిశీలించగా 82 శాతం మేర ఫలితాలు సానుకూలంగా వచ్చాయని వెల్లడించారు. అయితే ఈ టెక్నాలజీ తమ భావాలు వ్యక్తం చేయలేని వారికి ఎంతో బాగా ఉపయోగ పడుతుంది అని...కానీ దీన్ని ప్రభుత్వాలు, ప్రవేట్ సంస్థలు నిఘాకు వాడితే ప్రమాదం అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.