ప్రాణం తీసిన సరదా పోటీ

ఆఫీస్ లో సాగిన ఈ మందు పోటీ తర్వాత ఆ కంపెనీ ని మూసి వేశారు. ఈ తతంగం అంతా జరిగింది చైనాలో. జహాంగ్ అనే వ్యక్తి చైనీస్ బైజీయూ స్పిరిట్ తాగి ప్రాణాలు కోల్పోయాడు. పోలీస్ లు ఈ కేసు విచారణ చేస్తున్నారు. ఆఫీస్ లో పని ఒత్తిడి నుంచి ఉపశమనం పొందటానికి ఆఫీస్ లో రకరకాల పార్టీ లు చేసుకుంటారు. ఇది ప్రతి చోట జరిగేదే. కానీ ఇలా గంటలో ఏకంగా లీటర్ మద్యం సేవించి..అది కూడా రెండు లక్షలు గెలుచు కోవటం కోసం ప్రాణాలు పోగొట్టుకున్న ఘటన కలకలం రేపింది.