Telugu Gateway
Top Stories

భారత పర్యాటకులకు మాల్దీవులు షాక్

భారత పర్యాటకులకు మాల్దీవులు షాక్
X

టాలీవుడ్, బాలీవుడ్ ..ఇలా సెలబ్రిటీలు అందరూ గత ఏడాది కాలంగా చలో మాల్దీవులు అంటూ ఎంచక్కా అక్కడ చక్కర్లు కొట్టొచ్చారు. కొంత మందికి అక్కడి రిసార్ట్స్స్ స్పాన్సర్ షిప్ కార్యక్రమం కింద ఆహ్వానించగా..చాలా మంది సొంత డబ్బులతోనే వెళ్లారు. ఇప్పుడు దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు సెలబ్రిటీలతోపాటు సంపన్నులను ఎక్కడా కదలకుండా చేస్తున్నాయి. దుబాయ్ తోపాటు మాల్దీవుల వంటి ప్రముఖ పర్యాటక ప్రాంతాలకు వెళ్ళే ఛాన్స్ లేకుండా పోయింది. ఇప్పుడు సెలబ్రిటీలు, సంపన్నులకు మాల్దీవులు బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 27 నుంచి భారత్ కు చెందిన పర్యాటకులను అనుమతించబోమని తేల్చిచెప్పింది.

తమ పర్యాటక ప్రాంతాలను సురక్షితమైన ప్రాంతాలుగా ఉంచేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. గత కొన్ని నెలలుగా మాల్దీవులకు వెళ్లిన వారిలో అత్యధికులు భారతీయులే ఉన్నారు. కరోనా బారి నుంచి తప్పించుకునేందుకు చాలా మంది మాల్దీవులకు వెళ్లి అక్కడ చాలా రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు. కానీ ఇప్పుడు కరోనా రెండవ దశ దేశాన్ని వణికిస్తుండటంతో పలు దేశాలు భారత్ పై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి. ఆ జాబితాలో ఇప్పుడు మాల్దీవులు కూడా చేరింది. ఇప్పటికే యూకె, యూఏఈ, కెనడా, ఒమన్, హాంకాంగ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, కువైట్, సింగపూర్ వంటి దేశాలు బారతీయులపై నిషేధాన్ని అమలు చేస్తున్నాయి.

Next Story
Share it