Telugu Gateway
Top Stories

మార్కెట్లోకి మ‌హీంద్రా ఎక్స్ యూవీ700

మార్కెట్లోకి మ‌హీంద్రా ఎక్స్ యూవీ700
X

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా ఎక్స్ యూవీ 700 వ‌చ్చేసింది. మార్కెట్లో ఇప్ప‌టికే మ‌హీంద్రా ఎక్స్ యూవీ 700కి ఫుల్ క్రేజ్ ఏర్ప‌డింది. గురువారం నాడు ఈ కారును విడుద‌ల చేశారు. పెట్రోల్, డీజిల్ ఇంజ‌న్ల‌తో ఈ వాహ‌నాలు అందుబాటులో ఉండ‌బోతున్నాయి. ఎక్స్ యూవీ 700 ప్రారంభం ధ‌ర 11.99 ల‌క్షల రూపాయలుఅయితే..హైఎండ్ కారు ధ‌ర 21.09 ల‌క్షల రూపాయ‌లుగా ఉంది. ఇవి ఎక్స్ షోరూమ్ ధ‌ర‌లు. తొమ్మిది వేరియంట్ల‌లో ఎక్స్ యూవీ 700 అందుబాటులోకి వ‌చ్చింది.

అక్టోబ‌ర్ 10వ తేదీ నుంచి ఈ కార్ల డెలివ‌రీలు ప్రారంభం కానున్నాయ‌ని ఎంఅండ్ ఎం వెల్ల‌డించింది. అక్టోబ‌ర్ 1 నుంచే షోరూమ్స్ లో వాహ‌నాలు అందుబాటులో ఉండ‌నున్నాయి. అత్యాధునిక సాంకేతిక ప‌రిజ్ణానంతో ఈ కారును అందుబాటులోకి తెచ్చారు. వాయిస్ క‌మాండ్స్ తో ప‌నిచేసే ఫీచ‌ర్ ఇందులో ఉండ‌నుంది. ఈ ఫీచ‌ర్ ద్వారా కారులో ప‌లు కమాండ్స్ ఇవ్వొచ్చు. ఈ వాహ‌నంలో మూడు డ్రైవింగ్ మోడ్స్ అందుబాటులో ఉంటాయ‌ని కంపెనీ వెల్ల‌డించింది. ఈ కారును మెకాక్ ఫ్లాట్ ఫాంపై మ‌హీంద్రా డెవ‌ల‌ప్ చేసింంద‌న్నారు.

Next Story
Share it