మార్కెట్ తగ్గినా 52 వారాల గరిష్ట స్థాయికి

దీంతో పాటు కంపెనీ నాన్ ఫార్మా విభాగాలు అయిన యానిమల్ హెల్త్, క్రాప్ సైన్స్ వంటి వాటిపై కూడా ఫోకస్ పెట్టనుంది. కంపెనీ సిడీఎంఓ బిజినెస్ విషయంలో పలు బ్రోకరేజ్ సంస్థలు ఎంతో బుల్లిష్ గా ఉన్నాయి. వచ్చే రెండేళ్ల కాలంలో లారస్ లాబ్స్ ఏకంగా మూడు వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టనుంది. ఈ మొత్తం ఉత్పత్తి సామర్ధ్యాలను పెంచుకోవటంతో పాటు కొత్త యూనిట్ల ఏర్పాటుకు ఉపయోగించనున్నారు. సోమవారం నాడు ఈ షేర్లు ఏకంగా 1500 రూపాయలపైన ముగిసినందున మరికొంత కాలం ఈ షేర్ల లో జోష్ కొనసాగవచ్చు అనే అంచనాలు ఉన్నాయి. సోమవారం నాడు బిఎస్ఈ సెన్సెక్స్ మాత్రం పెద్ద ఎత్తున ఊగిసలాడి చివరకు 372 పాయింట్ల నష్టంతో 76728 పాయింట్ల వద్ద ముగిసింది.



