అంచనాలు దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధర

అంచనాలు దాటిన జియో ఫైనాన్సియల్ సర్వీసెస్ షేర్ ధరత్వరలోనే ఈ షేర్లు స్టాక్ మార్కెట్ లో లిస్ట్ కానున్నాయి. తాజాగా ఖరారు అయిన 262 రూపాయల లెక్కన జియో ఫైనాన్సియల్ షేర్ మార్కెట్ విలువ అప్పుడే 1 .72 లక్షల కోట్ల ను అధిగమించింది. దీంతో ఇప్పుడు ఇది దేశంలోనే 32 వ విలువైన కంపెనీగా అవతరించింది. ఇది పలు దిగ్గజ కంపెనీల విలువ కంటే ఎక్కువ కావటం విశేషం. రిలయన్స్ నుంచి విడిపోయిన తర్వాత దేశంలోనే ఐదవ అతి పెద్ద ఫైనాన్సియర్ గా జియో ఫైనాన్సియల్ అవతరించనుంది. ప్రస్తుతం మార్కెట్ లో ఉన్న పేటిఎం, బజాజ్ ఫైనాన్స్ లకు ఇది గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది అని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీనికి ప్రధాన కారణం రిలయన్స్ కు ఉన్న నెట్ వర్క్ కూడా ఒక కారణం అని చెప్పొచ్చు. గురువారం నాడు కూడా రిలయన్స్ షేర్ ధర 31 రూపాయల లాభంతో 2620 రూపాయల వద్ద క్లోజ్ అయింది.



