వైసీపీ ఎంపీ కంపెనీలో ఐటి దాడులు
BY Admin6 July 2021 7:09 AM GMT
X
Admin6 July 2021 7:09 AM GMT
వైసీపీ రాజ్యసభ సభ్యుడు అయోధ్య రామిరెడ్డికి చెందిన రాంకీ కంపెనీపై మంగళవారం నాడు ఐటి శాఖ దాడులు ప్రారంభం అయ్యాయి. అయోధ్య రామిరెడ్డి రాంకీ సంస్థ ఛైర్మన్ గా ఉన్నారు. గచ్చిబౌలిలో రాంకీ ప్రధాన కార్యాలయంతోపాటు మొత్తం 15 చోట్ల దాడులు జరుగుతున్నట్లు సమాచారం. ఐటి అధికారులు మొత్తం 15 టీమ్ లు గా ఏర్పడి ఈ దాడులు నిర్వహిస్తున్నారు. రాంకీ గ్రూప్ పలు రంగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది.
Next Story