Telugu Gateway
Top Stories

ఇద్దరి కోసం విమానం టిక్కెట్లు అన్నీకొన్నాడు

ఇద్దరి కోసం విమానం టిక్కెట్లు అన్నీకొన్నాడు
X

ప్రయాణం చేయాలి..కానీ సురక్షితంగా ఉండాలి. ఆంక్షలు ఎత్తేసిన తర్వాత ఏ విమానం చూసినా ఫుల్. మరి ఎలా?. ఉన్నది ఇద్దరే. జకార్తా నుంచి బాలి చేరుకోవాలి. చార్టెడ్ ఫ్లైట్ బుక్ చేస్తే చాలా ఖర్చు అవుతుంది. అందుకే ఓ ప్లాన్ వేశారు. ప్రయాణించేది ఇద్దరే అయినా..ఫ్లైట్ లో టిక్కెట్లు అన్ని కొనుగోలు చేశారు. తీరా ప్రయాణ సమయానికి సదరు వ్యక్తి..ఆయన భార్య మాత్రమే విమానం ఎక్కేసి ఎంచక్కా ప్రయాణించారు. ఇతరుల నుంచి కరోనా వైరస్ సోకే ప్రమాదం ఉందనే భయపడే ఈ పని చేశారు.

ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించారు. జకార్తాకు చెందిన రిచర్డ్ ముల్జాదీ వైరస్ కు బయపడి మొత్తం ఫ్లైట్ బుక్ చేసినట్లు తెలిపాడు. అందులో ఆయన, ఆయన భార్య మాత్రమే ప్రయాణం చేశారు. తాను ఒక్కడే కన్పించేలా ఖాళీగా ఉన్న ఫ్లైట్ ఫోటోను కూడా ఆయన షేర్ చేశారు. చాలా మంది విదేశీ పర్యటనకు ప్రత్యేక విమానాలు బుక్ చేసుకుని వెళుతున్నారు. మరికొంత మంది అయితే అతి తక్కువ సీట్లు ఉండే బిజినెస్ క్లాస్ మార్గాన్ని ఎంచుకుంటున్నారు.

Next Story
Share it