సంపన్న ఎగవేతదారులు బ్యాంకులను ముంచింది 2.4 లక్షల కోట్లు

ఇక్కడ మరో కీలకమైన విషయం ఏమిటంటే ఈ సంపన్న ఎగవేతదారులు అందరూ ఎగనామం పెట్టింది అంతా ప్రభుత్వ రంగ బ్యాంకులకే కావటం విశేషం. ఇందులో ప్రైవేట్ బ్యాంకుల వాటా నామమాత్రంగా మాత్రమే ఉంది. అయితే ఇందులోనూ ఎస్ బిఐ , దాని అనుబంధ బ్యాంకుల వాటానే మొత్తం వాటానే 71,896 కోట్ల రూపాయలు కాగా..ఈ వాటా 30.4 శాతంగా ఉంది. ఆ తర్వాత స్థానంలో పంజాబ్ నేషనల్ బ్యాంకు 39,455 కోట్ల రూపాయలు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 29860 కోట్ల రూపాయలు, బ్యాంక్ ఆఫ్ బరోడా 25,440 కోట్ల రూపాయలు, ఐడిబిఐ బ్యాంకు లిమిటెడ్ 21,751 కోట్ల రూపాయలుగా ఉన్నాయి. మరో విశేషం ఏమిటంటే దేశ ఆర్ధిక రాజధాని ముంబయ్ నగరం ఉన్న రాష్ట్రం అయిన మహారాష్ట్ర అత్యధిక మంది ఎగవేతదారులు ఉన్న రాష్ట్రంగా నిలిచింది. ఆ తర్వాత స్థానంలో ఢిల్లీ ఉంటే..మూడవ స్థానంలో పశ్చిమ బెంగాల్, నాల్గవ స్థానంలో గుజరాత్, ఐదవ స్థానంలో తెలంగాణ, ఆరవ స్థానంలో తమిళనాడు ఉంది.



