యూఏఈ, యూఎస్ లకు భారత్ సెల్ ఫోన్లు ఎగుమతి

ఇదే ఊపుతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో లక్ష కోట్ల సెల్ ఫోన్ ఎగుమతులు సాధించాలని ఎలక్ట్రానిక్స్, ఐటి మంత్రిత్వ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది. 2027 సంవత్సరానికి ఇండియా లోనే ఐ ఫోన్ ల తయారీ 50 శాతం వరకు చేరే అవకాశం ఉంది అని అంచనా వేస్తున్నారు. ఇప్పటివరకు చైనా లోనే ఎక్కువగా ఐ ఫోన్లు తయారు అవుతూ వస్తున్నాయి. ఇప్పుడు ఇది భారత్ కు మారుతుంది. భారత్ తో పాటు వియత్నాం కూడా మరో లబ్దిదారుగా మారనుంది. ఐ ఫోన్ ఒక్క డిసెంబర్ లోనే ఇండియా నుంచి ఏకంగా 8200 కోట్ల రూపాయల సెల్ ఫోన్లను ఎగుమతి చేసి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు దేశం ప్రధానంగా ఎగుమతే లక్ష్యంగా సెల్ ఫోన్ల తయారీపై ఫోకస్ పెట్టింది.



