Telugu Gateway
Top Stories

రెండు ల‌క్షల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు

రెండు ల‌క్షల‌కు చేరువ‌లో క‌రోనా కేసులు
X

దేశంలో క‌రోనా కేసులు ఊహించ‌ని స్థాయిలో న‌మోదు అవుతున్నాయి. సోమ‌వారం నాడు కాస్త త‌గ్గిన‌ట్లే క‌న్పించినా..మంగ‌ళవారం నాడు మాత్రం రికార్డు కేసులు న‌మోదు అయ్యాయి. గడిచిన 24 గంటలలో ఏకంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. అంటే ఇంచుమించు ఒక్క రోజులోనే రెండు ల‌క్షల కేసుల‌కు చేరువ అయ్యాయి. గత 24 గంటల్లో 60,405 మంది వైరస్‌ బారి నుంచి రిక‌వ‌రి అయ్యారు. మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్‌ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో గత 24 గంటలలో 4,868 ఒమిక్రాన్‌ కేసులు నమోదయ్యాయి.

Next Story
Share it