Telugu Gateway
Top Stories

కేసులు పెరిగాయి..మరణాలు తగ్గాయి

కేసులు పెరిగాయి..మరణాలు తగ్గాయి
X

దేశంలో కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదు అయింది. అయినా మూడు లక్షల లోపే ఉన్నాయి. కొంతలో కొంత ఊరట కలిగించే పరిణామం ఏమిటంటే అంతకు ముందు రోజుతో పోలిస్తే మరణాలు తగ్గుముఖం పట్టాయి. గత కొన్ని రోజులుగా దేశంలో రోజువారీ మరణాలు నాలుగు వేల పైనే నమోదు అవుతూ వస్తున్నాయి. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 2,76,070 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా 3,874 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే కోలుకున్న వారు 3,69,077 మంది ఉన్నారు.

దేశంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 2,57,72,400 కి చేరినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ప్రస్తుతం 31,29,878 మందికి చికిత్స కొనసాగుతోంది. కరోనా నుండి ఇప్పటి వరకు కోలుకున్న 2,23,55,440 మంది. కోవిడ్-19వైరస్ సోకి ఇప్పటివరకు 2,87,122 మంది మృతి.దేశవ్యాప్తంగా రికవరీ రేటు 86.74శాతం, మరణాల రేటు 1.11శాతంగా నమోదు అయింది.ఇప్పటివరకు దేశంలో 18,70,09,792 మందికి కరనా వ్యాక్సిన్ వేశారు.

Next Story
Share it