Telugu Gateway
Top Stories

డీజిల్ కార్లపై నిషేధం

డీజిల్ కార్లపై నిషేధం
X

దేశంలో డీజిల్ కార్లపై నిషేధం విధించబోతున్నారా?. ఇది 2027 నుంచి అమల్లోకి రానుందా అంటే ఈ దిశగానే కేంద్రం అడుగులు వేస్తోంది. కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ నియమించిన నిపుణుల కమిటీ ఇవే సూచనలు చేసింది. దేశంలో పది లక్షలు పైన జనాభా ఉన్న పట్టణాల్లో 2027 నుంచి డీజిల్ కార్లను నిషేదించాలని..మాజీ చమురు శాఖ కార్యదర్శి తరుణ్ కపూర్ నేతృత్వంలోని కమిటీ కేంద్రానికి సిఫారసు చేసింది. డీజిల్ కార్ల స్థానంలో ఎలక్ట్రిక్, గ్యాస్ కార్ల వైపు మొగ్గుచూపాలని ఈ కమిటీ కేంద్రానికి సూచించింది. పట్టణాల్లో ఉద్గారాలను (కాలుష్యం) నియంత్రిచేందుకు ఇది అవసరం అని పేర్కొంది. ముఖ్యంగా పట్టణాల్లో 2024 నుంచి రవాణాకు డీజిల్ బస్సు లను అనుమతించరాదు అన్నారు. కేవలం ఎలక్ట్రిక్ బస్సు లను మాత్రమే కొత్తగా నగర రవాణాకు జత చేసేలా చూడాలన్నారు. ఈ ప్యానెల్ సిఫారసులను కేంద్ర చమురు మంత్రిత్వ శాఖ తన వెబ్ సైట్ లో పెట్టింది.

ఈ సిఫారసులను కేంద్ర కాబినెట్ ఆమోదించిన తర్వాతా అమల్లోకి వస్తాయి. దేశంలో వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్న ఇంధనాల్లో డీజిల్ దే సింహభాగంగా నిపుణులు చెపుతున్నారు. 2024 నుంచి కేవలం సిటీల్లో ఎలక్ట్రిక్ రవాణా వాహనాలకు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసేలా చూడాలన్నారు. కార్గో రవాణాకు కూడా రైల్వే తో పాటు గ్యాస్ ఆధారిత ట్రక్కులు ఎక్కువ వాడాలన్నారు. ఇప్పటికే దేశంలోని కీలక ఆటోమొబైల్ సంస్థలు అన్ని ఎలక్ట్రిక్ వెహికల్స్ తయారీపై వేల కోట్ల పెట్టుబడులు పెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఎలక్ట్రిక్ కార్లు మార్కెట్ లోకి వచ్చినా వీటి వాటా పెరగటానికి ఇంకా కొన్ని సంవత్సరాలు పడుతుంది అనే అంచనాలు ఉన్నాయి. ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాల తయారీ వేగవంతం చేసేందుకు ఉద్దేశించిన ఫేమ్ స్కీం కింద ప్రోత్సాహకాలు పొడిగించే అంశాన్ని కేంద్రం పరిశీలించాలని కమిటీ కేంద్రాన్ని కోరింది.

Next Story
Share it