ఏప్రిల్ లో మరింత తగ్గుతాయా?!

ఒక వైపు ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధం ఎప్పుడు ఆగుతుందో ఎవరికీ స్పష్టత లేదు. ఈ యుద్ధం తీవ్రం అవుతున్న వేళ బంగారం ధరలు భారీగా పెరుగుతాయి అన్న అంచనాలకు భిన్నంగా గోల్డ్ రేట్ క్రమంగా తగ్గుతూ వస్తోంది. దీంతో రాబోయే రోజుల్లో ఈ రేట్లు ఎలా ఉంటాయి అన్నదే ఇప్పుడు ఎక్కువ మంది మదిలో మెదులుతున్న ప్రశ్న. దేశంలో పలు కీలక రాష్ట్రాల్లో ఎన్నికలు ఉండటంతో కేంద్రంలోని మోడీ సర్కారు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచలేదు. ఎన్నికలు లేకపోయి ఉంటే ఇప్పటికే ధరలు పెరిగి ఉండేవి అన్నది ఎక్కువ మంది చెపుతున్న మాట. కొంత ఆలస్యంగా అయినా ఈ ధరలు పెంచక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. ఇదే జరిగితే రాబోయే రోజుల్లో ద్రవ్యోల్బణం పెరిగి వడ్డీ రేట్లకు కూడా రెక్కలు వచ్చే అవకాశం ఉంటుంది. అదే జరిగితే బంగారం కొనుగోళ్లపై ప్రభావం పడుతుంది. ఇప్పటి వరకు ఉన్న అంచనాల ప్రకారం ఏప్రిల్ 15 వరకు బంగారం ధరలు తీవ్ర ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉంది అని...ఎక్కువ శాతం రేట్లు తగ్గటానికి ఛాన్సులు ఉన్నట్లు నిపుణులు చెపుతున్నారు.



