Telugu Gateway
Top Stories

జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ ఘటన

జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ లో షాకింగ్ ఘటన
X

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో ఊహించని పరిణామం. శుక్రవారం నాడు విమానాశ్రయంలో ఉన్న ఒక ప్రయాణికుడి పక్కనే రూఫ్ ప్యానెల్ ఒకటి ఊడి పడింది. ఈ ఘటనతో శశి ధరన్ అనే ప్రయాణికుడు షాక్ కు గురి అయ్యాడు. కింద పడిపోయిన రూఫ్ ప్యానెల్ ఫోటో ను ఎక్స్ లో షేర్ చేశారు...అదే సమయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియాకు ట్యాగ్ చేశారు. సెక్యూరిటీ చెక్ ఇన్ పూర్తి చేసుకుని తన గేట్ వైపు వెళుతున్న సమయంలో శశి ధరన్ తో పాటు మరికొంత మంది ప్రయాణికులకు ఈ అనుభవం ఎదురైంది. ఈ ఘటన జరిగిన తర్వాత విమానాశ్రయంలోని క్విక్ రెస్పాన్స్ టీం ( క్యూఆర్ టి) టీం అక్కడకు చేరుకోవటానికి పది హేను నిమిషాల సమయం పట్టింది అని శశి ధరన్ తెలిపారు.

తాను ఈ అంశంపై ఫిర్యదు చేయగా తాము దీనిపై విచారణ జరుపుతాం అని చెప్పినట్లు అయన వెల్లడించారు. ఈ ఘటనపై స్పందించిన జీఎంఆర్ ఎయిర్ పోర్ట్ టెర్మినల్ లో జరిగిన ఘటన పై స్పందించింది. పానెల్స్ నిర్వహణ, వాటిని శుభ్రం చేసేటప్పుడు జాయింట్ లూజ్ అయి ఈ ఘటన జరిగినట్లు గుర్తించామని..భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కాకుండా అన్ని పానెల్స్ చెక్ చేస్తున్నట్లు వెల్లడించింది. ప్యానెల్ ఊడిపడటంతో ఆ సమయంలో పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రయాణికులు భయబ్రాంతులకు గురయ్యారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగక పోవటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

Next Story
Share it