ఐపీవోల ద్వారా పెరిగిన నిధుల సమీకరణ
BY Admin14 April 2021 4:03 PM GMT
X
Admin14 April 2021 4:03 PM GMT
గత ఆర్ధిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా, రైట్స్ ఇష్యూల ద్వారా సమీకరించిన నిధులు గణనీయంగా పెరిగాయని ఆర్ధిక మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 2021 మార్చితో ముగిసిన ఆర్ధిక సంవత్సరంలో ఐపీవోల ద్వారా సమీకరించిన మొత్తం 115 శాతం మేర పెరిగి 46,029 కోట్ల రూపాయలకు చేరింది. రైట్స్ ఇష్యూ ద్వారా 64,058 కోట్ల రూపాయల మేర సమీకరించారు. గత ఏడాదిలో మొత్తం 55 ఐపీవోలు వచ్చాయి.
Next Story