Telugu Gateway
Top Stories

ఎయిర్ ఇండియా సేల్..1705 రూపాయలకే టికెట్

ఎయిర్ ఇండియా సేల్..1705 రూపాయలకే టికెట్
X

కొత్త ఏడాది...కొత్త ఆఫర్ తో ముందుకు వచ్చింది ప్రముఖ ఎయిర్ లైన్స్ ఎయిర్ ఇండియా. ఈ ఆఫర్ కింద 1705 రూపాయల నుంచి విమాన టికెట్ లు ఆఫర్ చేస్తోంది. కేవలం దేశీయ రూట్లలో మాత్రమే ఈ ఆఫర్ వర్తిస్తుంది అని వెల్లడించింది. జనవరి 21 నుంచి అంటే నేటి నుంచి 23 వ తేదీవరకు టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఆఫర్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్ల పై 2023 ఫిబ్రవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు ప్రయాణించే వెసులుబాటు కల్పించారు. టికెట్ ధరల ఆఫర్ 1705 రూపాయల నుంచి ప్రారంభం అవుతున్నా రూట్ ను బట్టి ధర మారే అవకాశం ఉంటుంది. అయితే ఇతర రోజులతో పోలిస్తే ఈ ఆఫర్ లో మాత్రం కాస్త తక్కువ ధరకే టికెట్స్ లభిస్తాయని చెప్పొచ్చు. ఫ్లై ఎయిర్ ఇండియా సేల్ పేరుతో విక్రయాలు సాగిస్తున్నారు.

Next Story
Share it