Telugu Gateway
Top Stories

అమెరికాలో కాల్పులు..పన్నెండు మంది మృతి

అమెరికాలో కాల్పులు..పన్నెండు మంది మృతి
X

గత కొన్ని రోజలుగా అమెరికాలో కాల్పుల వ్యవహారాలు వరస పెట్టి ప్రజల ప్రాణాలు తీసేస్తున్నాయి. కొన్ని చోట్ల ఈ కాల్పుల ఘటనలకు పాల్పడేవారు చిన్నారులు కూడా ఉండటం విశేషం. తాజాగా మరోసారి అమెరికాలోని పలు చోట్ల కాల్పుల ఘటనలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు చోట్ల జరిగిన కాల్పుల్లో 12 మంది మృతి చెందారు. కొలరాడో పార్క్‌ లో జరుగుతున్న పుట్టినరోజు వేడుకల్లో ఓ దుండగుడు కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో అక్కడికక్కడే ఆరుగురు మృతి చెందగా.. మరో వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయినట్లు అధికారులు తెలిపారు. పుట్టినరోజు వేడుకలు నిర్వహించిన ఆ కుటుంబంలోని ఓ మహిళకు నిందితుడు స్నేహితుడని పోలీసులు గుర్తించారు.

వేడుకలు జరుగుతున్న సమయంలో అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి ఒక్కసారిగా గన్‌తో కాల్పులు జరిపినట్లు పోలీసులు పేర్కొన్నారు. అనంతరం తనను తాను కాల్చుకొని మృతి చెందినట్లు తెలిపారు. ఉడ్‌ల్యాండ్‌లో ఓ దుండగుడు పక్కనున్న వారిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. నిందితుడు వారి ఇళ్లలోకి ప్రవేశించి మరీ కాల్పులు జరిపినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన తర్వాత నిందితుడు కాల్పులు జరిగిన ఓ ఇంటికి నిప్పంటించినట్లు పేర్కొన్నారు. దీంతో స్థానికులు ఆ దుండగుడిపై ఎదురుకాల్పులు జరపడంతో మృతి చెందినట్లు పోలీసులు పేర్కొన్నారు.

Next Story
Share it