Telugu Gateway
Top Stories

సీరమ్ లో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి

సీరమ్ లో అగ్ని ప్రమాదం..ఐదుగురు మృతి
X

కలకలం. దేశానికి కోవిషీల్డ్ కరోనా వ్యాక్సిన్ అందిస్తున్న సీరమ్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) యూనిట్ లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పూణేలోని సీరం సంస్థ మాంజ్రీ ప్లాంట్‌లోని టెర్మినల్-1 గేట్ వద్ద మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు సిబ్బంది మృతిచెందగా.. మరికొంత మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించిన చికిత్స అందిస్తున్నారు. అగ్ని ప్రమాదంతో ఆ ప్రాంతమంతా దట్టమైన పొగ అలుముకుంది.

సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంపై సీరం ఇన్‌స్టిట్యూట్ బృందం విచారణ జరుపుతోంది. ఆక్స్‌ ఫర్డ్‌ ఆస్ట్రా జెనెకా అభివృద్ధి చేసిన 'కోవిషీల్డ్' వ్యాక్సిన్ ను సీరం భారీ ఎత్తున తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. కోవిషీల్డ్‌ వ్యాక్సిన్ తయారీకి ఎలాంటి ఆటంకంలేదని సీరం సిబ్బంది తెలిపింది.

Next Story
Share it