ట్విట్టర్ ఇండియా ఎండీపై కేసు నమోదు
భారత్ లో ట్విట్టర్ వివాదాలు ఆగటం లేదు. తాజాగా ట్విట్టర్ ఇండియా మేనేజింగ్ డైరక్టర్ మనీష్ మహేశ్వర్ పై ఎఫ్ ఐఆర్ నమోదు అయింది. ట్విట్టర్ పెట్టిన మ్యాప్ లో జమ్మూకాశ్మీర్, లడ్డాక్ ప్రాంతాలను భారత్ వెలుపల చూపించటం దుమారం రేపిన విషయం తెలిసిందే. ఐపీసీలో పలు సెక్షన్ల కింద ఆయనపై కేసు నమోదు అయింది.ఉత్తరప్రదేశ్ లోని బులందేశ్వర్ లో బజరంగ్ దళ్ నాయకుడు చేసిన ఫిర్యాదు ఆధారంగా ఈ కేసు నమోదు చేశారు.
ఈ మ్యాప్ పై తీవ్ర విమర్శలు రావటం ట్విట్టర్ తర్వాత దీన్ని తన వెబ్ సైట్ నుంచి తొలగించింది. గతంలోనూ ట్విట్టర్ ఇలాంటి తప్పులు ఎన్నో చేసింది. గతంలోనూ ట్విట్టర్ ఇండియా ఎండీ మనీష్ మహేశ్వరిపై ఓ కేసు నమోదు అయింది. కేంద్రం తీసుకొచ్చిన ఐటి చట్టాల విషయంలో ట్విట్టర్ కేంద్రంతో ఘర్షణకు దిగుతోంది. దీనిపై కోర్టులను కూడా ఆశ్రయించింది.