Telugu Gateway
Top Stories

ఎమిరేట్స్ ఫ్లైట్ రికార్డు.. అందరూ వ్యాక్సిన్ తీసుకున్న వారే

ఎమిరేట్స్ ఫ్లైట్ రికార్డు.. అందరూ వ్యాక్సిన్ తీసుకున్న వారే
X

ప్రపంచ వ్యాప్తంగా విమానయాన రంగం ఇప్పుడిప్పుడే గాడిన పడుతోంది. మధ్యలో మధ్యలో పుట్టుకొస్తున్న కరోనా కొత్త రకం వైరస్ లు పలు దేశాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. అయితే విమాన ప్రయాణికుల సంఖ్య మాత్రం క్రమక్రమంగా పుంజుకుంటోంది. పర్యాటకులు కూడా పలు ప్రాంతాలను సందర్శించేందుకు ఆసక్తిచూపుతున్నారు. అయితే ఇలాంటి వారికి ఎమిరేట్స్ ఎయిర్ లైన్స్ మరింత భరోసా ఇచ్చే కార్యక్రమం చేపట్టింది. దుబాయ్ నుంచి లాస్ ఏంజెల్స్ వెళ్ళే ఎమిరేట్స్ విమానం కొత్త రికార్డు నెలకొల్పింది. అదేంటి అంటే పూర్తిగా వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందితో ఆదివారం నాడు ఈ విమాన సర్వీసును నడిపారు. ప్రపంచంలోనే ఈ ఫీట్ సాధించిన తొలి ఎయిర్ లైన్స్ గా ఎమిరేట్స్ నిలిచింది.

ఫ్రంట్ లైన్ సిబ్బంది అందరికీ వ్యాక్సిన్ ఇవ్వటం ద్వారా తమ విమానంలో ప్రయాణించే వారికి మరింత సురక్షితమైన భావన కల్పించినట్లు ఎమిరేట్స్ వెల్లడించింది. ప్రతి టచ్ పాయింట్ లోనూ వ్యాక్సిన్ తీసుకున్న సిబ్బందినే నియమించారు. బిజినెస్, ఫస్ట్ క్లాస్ తోపాటు బోర్డింగ్ గేట్ సిబ్బంది, ఇంజనీర్లు, పైలట్లు, క్యాబిన్ సిబ్బందికి వ్యాక్సిన్ వేశారు. ఒక నెల రోజుల వ్యవధిలోనే యూఏఈలో 26 వేల మందికి కోవిడ్ 19కి సంబంధించి రెండు డోసుల వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. తాము ఆరోగ్య, రక్షణకు సంబంధించి ఎంత ప్రాధాన్యత ఇస్తామో తమ పనితీరు నిరూపిస్తోందని పేర్కొంది. దీని ద్వారా ఎమిరేట్స్ విమానాల ద్వారా ప్రయాణించేవారికి తమ చర్యల ద్వారా అదనపు రక్షణ కల్పించినట్లు అవుతుందని వెల్లడించారు.

Next Story
Share it