Telugu Gateway
Top Stories

ధమాని ఫ్యామిలీ దిమ్మతిరిగే రియల్ డీల్

ధమాని ఫ్యామిలీ దిమ్మతిరిగే రియల్ డీల్
X

డీ మార్ట్ అధినేత రాధా కిషన్ ధమాని ఫ్యామిలీ తో పాటు అయన స్నేహితులు కలిసి ముంబై లోని ఖరీదైన ప్రాంతంలో అదిపెద్ద రియల్ ఎస్టేట్ డీల్ చేశారు. వీళ్లు 1238 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 28 విలాస వంతమైన ఫ్లాట్ లు కొనుగోలు చేశారు. ఒబెరాయ్ త్రీ సిక్స్టీ వెస్ట్ ప్రాజెక్ట్ లో ఈ డీల్ జరిగింది. దేశంలో జరిగిన అది పెద్ద రియల్ ఎస్టేట్ డీల్ ఇదే అని సమాచారం. ధమాని ఫ్యామిలీ తో పాటు అయన స్నేహితులు కొనుగోలు చేసిన ఫ్లాట్స్ మొత్తం కార్పెట్ ఏరియా లక్ష ఎనభై నాలుగు వేల చదరపు అడుగులు ఉంటుంది అని..ఇందులో వంద కార్ల పార్కింగ్ ప్లేస్ కూడా ఉంది. సగటున ఇందులో ఒక్కో అపార్ట్మెంట్ ఖరీదు 40 నుంచి 50 కోట్ల రూపాయల విలువ ఉంటుంది అని అంచనా. ఏప్రిల్ 1 నుంచి అమలులోకి రానున్న కొత్త కాపిటల్ గెయిన్స్ నిబంధలను దృష్టిలో పెట్టుకుని ఈ డీల్ చేసినట్లు చెపుతున్నారు. కొన్ని వ్యక్తుల పేరుమీద మరికొన్ని కంపెనీ ల పేరు మీద కొనుగోలు చేసినట్లు కధనాలు వచ్చాయి.

2023 ఫిబ్రవరి 3 న ఈ డీల్ పూర్తి అయింది. డెవలపర్ వికాస్ ఒబెరాయ్ తో కలిసి సుధాకర్ శెట్టి వర్లి ముంబై ప్రాంతంలో ఈ ప్రాజెక్ట్ చేపట్టారు. ఒక్కో అపార్ట్ మెంట్ ఏరియా సుమారు 5000 చదరపు అడుగులు ఉంటుంది. అయితే ఇందులో సుధాకర్ శెట్టి కంపెనీ స్కైలార్క్ బిల్డ్ కాన్ పిరమల్ ఫైనాన్స్ నుంచి 1000 కోట్ల రూపాయల రుణం తీసుకుంది అని ..ఈ చెల్లింపుల కోసం ఒకింత తక్కువ ధరకే ఈ అమ్మకాలు చేసినట్లు సమాచారం. డీ మార్ట్ కు చెందిన రాధాకిషన్ ధమాని, అయన సోదరుడు గోపి కిషన్ ధమాని లు 2021 లో ముంబై లోని అత్యంత విలాసవంతమైన మలబార్ హిల్ ప్రాంతంలో 1001 కోట్ల రూపాయల వ్యయంతో ఇండిపెండెంట్ ఇళ్ళు కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈ కొత్త డీల్ ముంబై రియల్ ఎస్టేట్ మార్కెట్ లో హాట్ టాపిక్ గా మారింది.

Next Story
Share it