కొత్త రికార్డు క్రియేట్ చేయనున్న ఢిల్లీ విమానాశ్రయం
అంటే ఈ సంఖ్యతో పోలిస్తే నాల్గవ రన్ వే అందుబాటులోకి వచ్చాక ప్రయాణికుల హ్యాండ్లింగ్ సామర్ధ్యం రెట్టింపు కానుంది. అయితే దీనికి ఎన్నో జాగ్రత్తతో విమానాల ట్రాపిక్ నిర్వహణతో పాటు ఎన్నో కొత్త భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అత్యంత కీలకమైన ఎయిర్ ట్రాపిక్ కంట్రోలర్స్ (ఏటీసీవో) కొరత ఉందని అధికారులు వెల్లడించారు. దేశంలో కొత్త విమానాశ్రయాలు వస్తుండటంతో పాటు దేశంలోనే అత్యధిక రద్దీ ఉంటే..అతి పెద్దదైన ఐజీఏలో ట్రాఫిక్ నిర్వహణకు ఎంతో అనుభవం ఉన్న ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ కావాల్సిన ఉందన్నారు. దేశంలో ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలను ఆధునికీకరించేందుకు కూడా కేంద్రం చర్యలు తీసుకుంటోంది. ఢిల్లీ విమానాశ్రయాన్ని జీఎంఆర్ ఎయిర్ పోర్ట్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో ఏఏఐకు కూడా 26 శాతం వాటా ఉంది.