Telugu Gateway
Top Stories

క్రెడిట్ కార్డు లావాదేవీల కొత్త రికార్డు

క్రెడిట్ కార్డు లావాదేవీల కొత్త రికార్డు
X

దేశంలో క్రెడిట్ కార్డు ల వినియోగం గణనీయంగా పెరుగుతోంది. తాజాగా దీనికి సంబంధించి కొత్త రికార్డు నమోదు అయింది. రిజర్వు బ్యాంకు అఫ్ ఇండియా (ఆర్ బిఐ ) గణాంకాల ప్రకారం 2023 మేలో మొదటి సారి క్రెడిట్ కార్డు ల ద్వారా ఖర్చు పెట్టిన మొత్తం 1 . 4 లక్షల కోట్లకు పెరిగింది. ఇదే ఇప్పటివరకు ఉన్న అల్ టైం హై.దీంతో పాటు ఇదే మే నెలలో క్రెడిట్ కార్డు ల సంఖ్య కూడా 87 మిలియన్లు దాటింది..అంటే ఏకంగా ఎనిమిది కోట్ల డెబ్భై లక్షల కార్డు లు పైగా వాడకంలో ఉన్నాయి. దేశంలోనే అత్యధిక క్రెడిట్ కార్డు లు జారీ చేసిన బ్యాంకు గా హెచ్ డి ఎఫ్ సి ఉంది. ఈ బ్యాంకు కార్డు లు 18 మిల్లియన్లకు పైగా అంటే...కోటి ఎనభై లక్షల కార్డు లతో నంబర్ వన్ పొజిషన్ లో ఉంది. ఆ తర్వాత స్థానాల్లో వరసగా ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్ బి ఐ కార్డు, ఐసిఐసి ఐ బ్యాంకు,యాక్సిస్ బ్యాంకు లు ఉన్నాయి. ఎస్ బి ఐ కార్డు లు కోటి డెబ్బయి లక్షలు పైన ఉండగా, ఐ సి ఐ సి ఐ కార్డు లు కోటి నలభై ఆరు లక్షలు పైగా, యాక్సిస్ బ్యాంకు కార్డు లు కోటిన్నర వరకు ఉన్నాయి.

ఒక్కో క్రెడిట్ కార్డు పై సగటున చేసే వ్యయం కూడా రికార్డు స్థాయిలో 16144 రూపాయలకు పెరిగింది అని ఆర్ బి ఐ వెల్లడించింది. 2023 మార్చి తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో ప్రతి నెలలో క్రెడిట్ కార్డు ల ద్వారా చేసిన వ్యయం గరిష్టంగా 1 . 2 లక్షల కోట్ల రూపాయలు ఉండగా..ఇప్పుడు అది రికార్డు స్థాయిలో 1 . 4 లక్షల కోట్ల కు పెరిగింది. ఈ ఏడాది జనవరి నుంచి అదనంగా 50 లక్షల కార్డు లు పెరిగి అవి 8 .7 కోట్లను దాటాయి. ఆస్తుల నాణ్యత పరంగా చూసుకుంటే...అంటే క్రెడిట్ కార్డు ల ద్వారా ఖర్చు పెట్టిన మొత్తాల తిరిగి చెల్లింపులు 90 రోజులు దాటినవి సుమారు మూడు శాతం వరకు ఉన్నాయి. అంతకు ముందు ఏడాది కంటే ఇది 0 .66 శాతం మేర పెరిగినట్లు ఆర్ బి ఐ నివేదిక వెల్లడించింది.

Next Story
Share it