Telugu Gateway
Top Stories

బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం

బర్గర్ కింగ్ పబ్లిక్ ఇష్యూ ప్రారంభం
X

దేశంలో వేగంగా విస్తరిస్తున్న క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (క్యూఎస్ఆర్) చైయిన్ అయిన బర్గర్ కింగ్ ఇండియా పబ్లిక్ ఇష్యూ బుధవారం నాడు ప్రారంభం అయింది. ఈ ఇష్యూ డిసెంబర్ 4న ముగియనుంది. కంపెనీ షేర్ ధరను 59-60 రూపాయలుగా నిర్ణయించింది. భారత్ లో తొలి ఐదేళ్ళ కార్యకలాపాల తర్వాత ఇప్పుడు పబ్లిక్ ఇష్యూకి వచ్చింది. ఒక్కోటీ పది రూపాయల ముఖ విలువతో ఈ షేర్లను జారీ చేస్తున్నారు.

ఈ ఇష్యూలో ధరఖాస్తు చేసే వారు కనీసం 250 షేర్లకు బిడ్ చేయాల్సి ఉంటుంది. ఆ పైన కూడా అదే లెక్కన ఎన్ని షేర్లు అయినా దరఖాస్తు చేయవచ్చు. పబ్లిక్ ఇష్యూ ద్వారా కంపెనీ 810 కోట్ల రూపాయలను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. బర్గర్ కింగ్ షేర్లు డిసెంబర్ 14న స్టాక్ మార్కెట్లో లిస్ట్ కానున్నాయి.

Next Story
Share it