అరవై వేల పాయింట్లకు చేరువలో సెన్సెక్స్
స్టాక్ మార్కెట్లు దుమ్మురేపాయి. సెన్సెక్స్ రాకెట్ లా దూసుకెళ్లింది. బీఎస్ఈ సెన్సెక్స్ ఏకంగా అరవై వేల పాయింట్లకు కొద్దిదూరంలో ఆగిపోయింది. ఇదే ట్రెండ్ కంటిన్యూ అయితే శుక్రవారం ఉదయమే ఈ రికార్డును బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది. గురువారం నాడు జీవితకాల గరిష్టానికి తాకింది. 958 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ 59,885.36 పాయింట్ల వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా మంచి లాబాలతో 17800 పాయింట్లపైనే ముగిసింది.
బుల్ ర్యాలీతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున లాభాలు చవిచూశారు. సెన్సెక్స్ లో అత్యధిక వెయిటేజ్ ఉన్న రిలయన్స్ షేర్ అరవై రూపాయల లాభంతో 2489 రూపాయలకు చేరింది. ఓ దశలో రిలయన్స్ 2497 రూపాయలకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల పరిణామాలతో మార్కెట్లు భారీ ఎత్తున లాభాలు గడించాయి. మార్కెట్ ర్యాలీతో కీలక షేర్లు అన్నీ లాభాల బాట పట్టాయి.