Telugu Gateway
Top Stories

జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ వాడేస్తుందా?!

జూనియర్ ఎన్టీఆర్ ను బీజేపీ వాడేస్తుందా?!
X

రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కొద్ది రోజుల క్రితం కేంద్ర హోమ్ మంత్రి అమిత్ షా హైదరాబాద్ లో జూనియర్ ఎన్టీఆర్ తో సమావేశం కావటం కలకలం రేపిన విషయం తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఎన్టీఆర్ రాజకీయ చర్చలకు కారణం అయ్యారు అని చెప్పొచ్చు. కర్ణాటకలోని బీజేపీ ప్రభుత్వం ఎన్టీఆర్ ను ఆ రాష్ట్ర అవతరణ దినోత్సవాలకు ప్రభుత్వ అతిధిగా పిలిచింది. ఇందులో దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ కు ఆ రాష్ట్ర టాప్ అవార్డు కర్ణాటక రత్న ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి ఇటు ఎన్టీఆర్ తో పాటు తమిళ సూపర్ స్టార్ రజని కాంత్ ని కూడా ఆహ్వానించారు. బీజేపీ ఏ పని చేసిన ఒక లెక్క లేకుండా చేయదు అన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాదే కర్ణాటకలో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉన్న విషయం తెలిసిందే. ప్రస్తుతం కర్ణాటక లోని సర్కారు తీవ్ర విమర్శలు ఎదుర్కుంటోంది. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ అధికారాన్ని నిలబెట్టు కుంటుందా అంటే చాలా అనుమానాలు ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో ఎలాగోలా ఈ కీలక హీరోల ఫాన్స్ లో ఎంతో కొంత మందిని తమ వైపు తిప్పు కుంటే ఫలితం ఉంటదనే ఉద్దేశంతోనే ఈ ప్లాన్ వేసినట్లు ఉన్నారనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది.

వాస్తవానికి రజని కాంత్ స్వరాష్ట్రం కర్ణాటకే. కానీ అయన తమిళనాడు లో సెటిల్ అయి అక్కడే సూపర్ స్టార్ గా ఎదిగిన సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ తల్లి కూడా ఆ రాష్ట్రానికి చెందిన వారే. ఇలా పలు అంశాలతో బీజేపీ వీళ్లద్దరిని తెలివిగా వాడు కునే ప్రయత్నం చేస్తుంది అనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో ఉంది. ఇది ఎంత మేరకు ఫలితాన్ని ఇస్తుందో తెలియాలి అంటే ఇంకా చాలా రోజులు ఎదురు చూడాల్సిందే. ఇప్పుడు ఉన్న పరిస్థితి ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఎన్టీఆర్ నేరుగా జోక్యం చేసుకొనే ఛాన్స్ లేదు. ఎందుకంటే అయన ఒకప్పుడు తన తాత పెట్టిన తెలుగు దేశం కోసం పని చేసారు. ఇప్పుడు రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే ఎన్నికల సమయంలో బీజేపీ తరపున కర్ణాటకలో ఒక పిలుపు ఇవ్వటానికి ఎన్టీఆర్ ముందుకు వస్తారా..ఒక వేళ బీజేపీ అక్కడ ఈ హీరో ఇమేజీని వాడుకోవాలని డిసైడ్ అయితే ఎన్టీఆర్ తప్పించుకోగలరా అన్న చర్చ కూడా సాగుతోంది. రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు. అప్పటివరకు వేచి చూడాల్సిందే.

Next Story
Share it