Telugu Gateway
Top Stories

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ముందు తెలంగాణ ప్రజలకే

భారత్ బయోటెక్ వ్యాక్సిన్ ముందు తెలంగాణ ప్రజలకే
X

ప్రధాని నరేంద్రమోడీ హైదరాబాద్ పర్యటనను పురస్కరించుకుని తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ కీలక డిమాండ్ ను లేవనెత్తారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ కు వ్యాక్సిన్ తెలంగాణ రాష్ట్రంలో తయారు కావడం గర్వకారణం అన్నారు. తెలంగాణ గడ్డ మీద వ్యాక్సిన్ తయారవుతుంది కాబట్టి ఆ ఫలితం ఇక్కడి ప్రజలకు ముందుగా అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీని డిమాండ్ చేస్తున్నామని తెలిపారు.

ఇక్కడి ప్రజలకు సరిపోయేన్ని వాక్సిన్ డోస్ లు ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా భయం పూర్తిగా పోవాలంటే వ్యాక్సిన్ ఒక్కటే మార్గం కాబట్టి ప్రజలందరికీ అతిత్వరలో వాక్సిన్ అందేలా చూడాలని ప్రధాని నరేంద్ర మోదీ నీ కోరుతున్నామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధాని శనివారం నాడు హైదరాబాద్ లోని భారత్ బయోటెక్ యూనిట్ ను సందర్శించి వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన అంశాలను పరిశీలించనున్నారు.

Next Story
Share it