తమిళనాడు ఫలితాలపై నిజమైన అంచనాలు

యాక్సిస్ మై ఇండియా. ఎగ్జిట్ పోల్స్ విషయంలో చాలా వరకూ పక్కాగా అంచనాలు వెలువరించే సంస్థ. కొన్నిసార్లు ఈ సంస్థ ఇచ్చిన అంచనాలు తప్పినా కూడా ఎక్కువ శాతం పక్కాగా వివరాలు అందిస్తూ దేశంలోనే విశ్వసనీయ సంస్థల్లో ఒకటిగా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన నాలుగు రాష్ట్రాలు..ఒక కేంద్రపాలిత ప్రాంతం అసెంబ్లీ ఎన్నికల విషయంలో అందరి దృష్టి ...ఎక్కువ ఫోకస్ ఉన్నదీ అంటే పశ్చిమ బెంగాల్...తమిళనాడు ఫలితాలపైనే అని చెప్పుకోవచ్చు. ఎన్నికలు ముగిసిన తర్వాత యాక్సిస్ మై ఇండియా సంస్థ ఒక్కటే హీరో విజయ్ కు చెందిన టీవీకే పార్టీ 98 నుంచి 120 సీట్లు సాధించే అవకాశం ఉంది అనే అంచనాలు వెలువరించింది. ఈ పార్టీకి 35 శాతం ఓట్ షేర్ దక్కుతుంది అని పేర్కొంది. ఇక్కడ విచిత్రం ఏమిటి అంటే దేశంలో ప్రముఖ ఛానెల్స్ తో పాటు మరి కొంత మంది అధికార డీఎంకే నే తిరిగి అధికారంలో వస్తాయని అంచనా వేశాయి.
అందుకే ఎక్కువ మంది విజయ్ పార్టీ టీవీకే విజయం సాధిస్తుంది అని నమ్మలేదు. కానీ యాక్సిస్ మై ఇండియా చెప్పిందే ఇప్పుడు నిజం అయింది. ఎవరూ ఊహించని రీతిలో టీవీకే ఇప్పుడు తమిళనాడు లో దిగ్గజ పార్టీ లు అయిన అధికార డీఎంకే తో పాటు ఏఐఏడీఎంకె ను కూడా చావు దెబ్బ కొట్టి విజయ్ సంచలన విజయం నమోదు చేశాడు. దీంతో యాక్సిస్ మై ఇండియా తో పాటు ఈ సంస్థ ఎండీ ప్రదీప్ గుప్తా ఇప్పుడు దేశ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారారు అనే చెప్పాలి. 2023 లో జరిగిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సమయంలో కూడా యాక్సిస్ మై ఇండియా పక్కాగా అంచనాలు వెలువరించింది.



