Telugu Gateway
Top Stories

పైలట్ ల రాజీనామాతో విలవిల

పైలట్ ల రాజీనామాతో విలవిల
X

దేశీయ విమానయాన రంగంలోకి వచ్చిన అది కొద్ది రోజుల్లోనే ఆకాశ ఎయిర్ లైన్స్ ఎన్నో సంచలనాలు నమోదు చేసింది. ఎప్పటి నుంచో సేవలు అందిస్తున్న స్పైస్ జెట్ ను అధిగమించి దేశీయ మార్కెట్ లో అధిక వాటాను దక్కించుకుంది. కానీ ఒకే సారి ఏకంగా 43 మంది పైలట్ లు రాజీనామా చేయటంతో ఒక్కసారిగా ఈ ఎయిర్ లైన్స్ తీవ్ర సంక్షోభంలో పడిపోయినట్లు అయింది. నోటీసు పీరియడ్ నిబంధనలు ఉల్లఘించి పైలట్ లు పెద్ద ఎత్తున రాజీనామా చేయటంతో గత కొన్ని రోజులుగా ఆకాశ ఎయిర్ లైన్స్ కు చెందిన ఫ్లైట్స్ పెద్ద ఎత్తున రద్దు అయి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చింది. అదే సమయంలో ఆకాశ ఎయిర్ లైన్స్ ఇమేజ్ కూడా దారుణంగా దెబ్బతిన్నది. దీంతో ఈ ఎయిర్ లైన్స్ పైలట్ ల రాజీనామా అంశంపై ఢిల్లీ కోర్టు ను ఆశ్రయించింది. అర్దాంతరంగా వెళ్ళిపోయినా పైలట్ లు 22 కోట్ల రూపాయలు చెల్లించేలా ఆదేశించాలని...వీరి నిష్క్రమణ కారణంగా తమకు భారీ ఎత్తున ఆదాయం పోవటంతో ఎయిర్ లైన్స్ రెప్యుటేషన్ కూడా దారుణంగా దెబ్బతిన్నట్లు వెల్లడించింది.

ఆకాశ ఫ్లీట్ లో మొత్తం బోయింగ్ 737 విమానాలు ఉండటంతో ఈ విమానాలు నడిపే పైలట్ లను వెంటనే నియమించుకోవడం కష్టంగా మారింది. ఏ 320 విమానాలతో పోలిస్తే బోయింగ్ 737 పైలట్ లు దొరకటం కొంత కష్టం అని పరిశ్రమ వర్గాలు చెపుతున్నాయి. తాజాగా ఆకాశ కు 20 వ విమానం కూడా రావటంతో విదేశీ రూట్లలో సర్వీసులు స్టార్ట్ చేసే అర్హత వచ్చింది. ఈ తరుణంలో ఒకే సారి పైలట్ లు రాజీనామా చేయటం పెద్ద దెబ్బగా మారింది. మరో వైపు కొంత పైలట్ లు కూడా తమపై దాఖలు చేసిన కేసు లపై బాంబే హై కోర్టు ను ఆశ్రయించారు. ఆకాశ కు రాజీనామా చేసిన వారు ఎయిర్ ఇండియా ఎక్సప్రెస్ లో చేరినట్లు చెపుతున్నారు. ప్రముఖ ఇన్వెస్టర్ , దివంగత రాకేశ్ ఝున్‌ఝున్‌వాలా ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. అతి తక్కువ సమయంలో దూసుకెళ్లిన ఆకాశ ఎయిర్ ..ఇప్పుడు అనూహ్యంగా చిక్కుల్లో పడింది. మరి ఈ సమస్య నుంచి ఆకాశ ఎయిర్ ఎలా బయటపడుతుందో వేచిచూడాల్సిందే.

Next Story
Share it