భయపెట్టిన ఎయిర్ ఇండియా ఫ్లైట్

హైదరాబాద్ నుంచి థాయిలాండ్ లోని ఫుకెట్ కు వెళ్లిన ఎయిర్ ఇండియా ఎక్స్ ప్రెస్ విమానం ప్రయాణికులను భయపెట్టింది. దీనికి ప్రధాన కారణం ల్యాండింగ్ గేర్ లో సమస్యలు రావటంతో ఈ విమానం సాధారణ వేగం కంటే ఎక్కువ వేగంతో బలంగా రన్ వే ని తాకింది. దీంతో ఈ విమానంలో ఉన్న ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఈ పరిణామం తో ఫుకెట్ ఎయిర్ పోర్ట్ రన్ వే తాత్కాలికంగా మూసివేశారు. ఈ మేరకు ఫుకెట్ ఎయిర్ పోర్ట్ అధికారులు ప్రకటన జారీ చేశారు. మార్చి 11 ఉదయం హైదరాబాద్ నుంచి ఫుకెట్ వెళ్లిన ఎయిర్ ఇండియా బోయింగ్ ఎక్స్ ప్రెస్ విమానం తీవ్ర సమస్య ఎదుర్కోవటం తో ల్యాండింగ్ సమయంలో విమానం ముందు టైర్ ఊడిపోయింది. ఈ విమానంలో ఏడుగురు సిబ్బంది, 131 మంది ప్రయాణీకులు ఉన్నారు.



