అదానీ గ్రూప్ పై ఓసిసిఆర్ పీ సంచలన ఆరోపణలు

ఇది ఇండియా లో లిస్టింగ్ నిబంధలను వ్యతిరేకం అని తెలిపింది. అదానీ షేర్ల లో వాళ్ళ కుటుంబ సభ్యుల ప్రమేయంతోనే ట్రేడింగ్ జరిగినట్లు తమ పరిశోధనలో తేలినట్లు పేర్కొన్నారు. అయితే అదానీ ఫ్యామిలి నుంచి డబ్బులు తీసుకుని చేసినట్లు మాత్రం తమకు ఆధారాలు దొరకలేదు అన్నారు. ఓసిసిఆర్ పీ జార్జి సొరస్ పెట్టుబడులతో నడిచే సంస్థ. అయితే ఈ ఆరోపణలను అదానీ గ్రూప్ తోసిపుచ్చింది. ఇవి హిండెన్ బర్గ్ రిపోర్ట్ లోని అంశాలను రీ సైకిల్ చేయటం వంటిదే తప్ప మరొకటి కాదు అని వివరణ ఇచ్చింది. ఇది అంతా విదేశీ ఫండ్స్, కొన్ని విదేశీ మీడియా సంస్థల కుట్రగా అభివర్ణించింది గ్రూప్. దేశంలో న్యాయప్రక్రియ సాగుతున్న వేళ ఈ దశలో ఈ రిపోర్ట్ రావటంపై పలు అనుమానాలు వ్యక్తం చేసింది. ఇదిలా ఉంటే ఓసిసిఆర్ పీ రిపోర్ట్ తో గురువారం నాడు అదానీ గ్రూప్ షేర్లు అన్ని భారీగా నష్ట పోయాయి. అదానీ గ్రూప్ లోని ఫ్లాగ్ షిప్ కంపెనీ అయినా అదానీ ఎంటర్ ప్రైజెస్ షేర్ 95 రూపాయల నష్టంతో 2418 రూపాయల వద్ద ముగిసింది. గ్రూప్ లోని అన్ని లిస్టెడ్ కంపెనీలు భారీ నష్టాలను మూట కట్టుకున్నాయి. ఈ ఎపిసోడ్ పై హిండెన్ బర్గ్ రీసెర్చ్ కూడా స్పందించింది. మరో సారి వాస్తవాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొంది.