విమాన టిక్కెట్ల ఆమ్మకంలోకి 'అదానీ వన్ '

విమానాశ్రయాల నిర్వహణే కాదు..విమాన టిక్కెట్ల అమ్మకం వ్యాపారం లోకి కూడా అదానీ గ్రూప్ ప్రవేశించింది. విమాన టిక్కెట్ల వరకే కాదు..చివరకు క్యాబ్ సర్వీసులు కూడా అందించనుంది. దీని కోసం 'అదానీ వన్ ' పేరుతో వెబ్ సైట్ తో పాటు ఒక యాప్ ను కూడా అందుబాటులోకి తెచ్చారు. దీనికి సంబదించిన యాడ్స్ ప్రస్తుతం పెద్ద ఎత్తున దర్శనం ఇస్తున్నాయి. అదానీ గ్రూప్ ఏవియేషన్ రంగంలోకి అడుగు పెట్టిన కొద్దికాలంలోనే దేశ విమానయాన రంగంలో కీ ప్లేయర్ గా మారిపోయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ కంపెనీ చేతిలో దేశ ఆర్థిక రాజధాని ముంబయి విమానాశ్రయం తో పాటు అహ్మదాబాద్, లక్నో, గౌహతి, జైపూర్, మంగళూరు, తిరువనంతపురం విమానాశ్రయాలు ఉన్న విషయం తెలిసిందే.



