భూములు అమ్మి స్కీమ్ లు అమలు చేయటానికి కెసిఆర్ ఎందుకు?!
ఇదే టిఆర్ఎస్ ప్రతిపక్షంలో ఉండగా ప్రభుత్వ భూముల విక్రయాలను తీవ్రంగా వ్యతిరేకించింది. అధికారం లోకి వచ్చాక మాత్రం తాను వద్దు అన్న పనులే చేస్తూ ముందుకు సాగుతోంది. ఈ పరిణామాలపై అధికారులు విస్మయం వక్తం చేస్తున్నారు. ప్రభుత్వ భూములు అమ్మి సంక్షేమ కార్యక్రమాల అమలు చేయటానికి సీఎం కెసిఆర్ ఎందుకు...ఏ అధికారికి ఆ పని అప్పగించినా చేస్తారు అని ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు. భూములు అయినా ఇతర వనరులు అయినా వాటిని సద్వినియోగం చేసుకునే మార్గాలు వెతకాలి కానీ తెగ నమ్మి పని పూర్తి చేసుకోవటం ఏ మాత్రం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఒక వైపు ఇదే కెసిఆర్ దేశంలో ప్రధాని మోడీ అన్ని అమ్మేస్తున్నారు అని విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. తెలంగాణ లో పలు పధకాల రూపకల్పన రాజకీయ అవసరాలకు అనుగుణంగా చేస్తున్నారు తప్ప...పేదల అవసరాలకు అనుగుణంగా ఉండటం లేదనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలా అధికారంలో ఉన్న పార్టీలు తమ రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఇలా ప్రజలందరికి చెందాల్సిన ఆస్తులను అమ్మటం సరికాదనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. కానీ పార్టీలు మాత్రం ప్రభుత్వ ఆస్తులతో తమ రాజకీయ ప్రయోజనాలు తీర్చుకుంటున్నాయి.టిఆర్ఎస్ ఇందులో ముందు వరసలో ఉంది. ఒక వైపు ప్రభుత్వ ఆస్తులు అమ్మటం, మరో వైపు దొరికినంత మేర అప్పులు చేయటం ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్న పని. దేశానికీ తెలంగాణ మోడల్ ఆదర్శం అని చెపుతున్న కెసిఆర్ రాష్ట్రంలోని పాఠశాలల్లో విద్యార్థులు ఎదుర్కుంటున్న సమస్యల గురించి మాత్రం పెద్దగా మాట్లాడరు.