వానొస్తే యాదాద్రి..వరదొస్తే కాళేశ్వరం డొల్లతనం తేలింది
అంటే ఇది ఏమైనా ముంచుడు పోటీనా?. ఏ ప్రభుత్వంలో మునిగినా..ఎప్పుడు తప్పు జరిగినా వాటి నుంచి పాఠాలు నేర్చుకుని మరింత పకడ్భందీగా ప్రజల సొమ్మును కాపాడాల్సిన, జవాబుదారీతనంతో ఉండాల్సిన మంత్రులే కాంగ్రెస్ హయాంలో కూడా మోటార్లు మునిగాయి కాబట్టి..ఇప్పుడు కాళేశ్వరం మోటార్లు మునిగాయి తప్పేమీలేదని చెబుతారా?. మొత్తం మీద అటు యాదాద్రి విషయంలో..ఇటు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో సీఎం కెసీఆర్ తోపాటు తెలంగాణ సర్కారు ప్రతిష్టకు పెద్ద మచ్చ వచ్చిందనే అభిప్రాయం అధికార వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. ఇంత కాలం విమర్శలను తిప్పికొడుతూ వెళ్ళారు కానీ..ఇప్పుడు చిక్కుల్లో పడినట్లు అయిందనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సీఎం కెసీఆర్ కేవలం యాదాద్రిపైనే ఫోకస్ పెట్టారు..కావాలని భద్రాచలాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు రాగా..కొన్ని సంవత్సరాల క్రితం వంద కోట్ల రూపాయలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ అది అమలుకు నోచుకోలేదు.