కెసీఆర్ కలలు మారుతున్నాయ్!
ప్రత్యామ్నాయ విధానంతో దేశానికి దారి చూపిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ నేతలు అయితే కెసీఆర్ ప్రధాని అయితే తప్పేంటి అని ప్రశ్నిస్తున్నారు. ఇదిలా ఉంటే టీఆర్ఎస్ అధినేత, సీఎం కెసీఆర్ తాను ఏమి చేసినా దేశానికి ఆదర్శమే అని చెబుతారు. ఉదాహరణకు ధరణి పోర్టల్. కానీ దేశానికి ఆదర్శం అని చెప్పే ధరణి పోర్టల్ లో మాత్రం తెలంగాణలో ఎవరి భూములు వారికి కాకుండా పోతున్నాయి. ఇంత గందరగోళం ఎప్పుడూ భూ సొంతదారులు ఎదుర్కొని ఉండరు. రైతులకు ఏటా డబ్బులిస్తూ..దానికి రైతు బందు అని పేరు పెట్టి ఇది కూడా దేశానికి ఆదర్శం అంటారు. దళిత కుటుంబాలకు పది లక్షల రూపాయలు ఇస్తూ దేశానికి ఆదర్శం అంటారు. ఆదర్శం అనేది పాలనలో ఉండాలి కానీ..పంచటం..పంచే స్కీమ్ లకు ఓ పేరు పెట్టి దేశంలో ఎక్కడైనా ఇలాంటి పథకాలు ఉన్నాయా అంటే అది ఆదర్శ పాలన అయిపోతుందా?. తొలి కల విషయంలో విజయం సాధించిన కెసీఆర్ ఇప్పుడు రెండవ కల విషయంలోనూ భారీ ఆశలే పెట్టుకున్నారు. చూడాలి ఏమి అవుతుందో..తెలంగాణ పారినంత తేలిగ్గా ఆయన పాచికలు ఇతర రాష్ట్రాల్లో పారతాయా..చూడాల్సిందే.