కెసిఆర్ టార్గెట్స్ మారుతున్నాయంటే!
సమ్మె సమయంలో ఆర్ టిసి కార్మికులను బహుశా ఏ ముఖ్యమంత్రి కూడా ఇబ్బంది పెట్టని రీతిలో కెసిఆర్ ఇబ్బంది పెట్టిన విషయం తెలిసిందే. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత అయితే జర్నలిస్ట్ ల పరిస్థితి దారుణాతి దారుణం అని చెప్పాలి. ఇప్పుడు అయితే ఏకంగా అక్రిడేషన్ ఉన్న జర్నలిస్టులను కూడా సచివాలయంలోకి రానివ్వని పరిస్థితి. సీఎం కెసిఆర్ జర్నలిస్ట్ ల విషయంలో కూడా అదే స్ట్రాటజీని వాడుతున్నారు. ఇద్దరు, ముగ్గురు నేతలకు పదవులు ఇస్తే చాలు..మిగిలిన వాళ్ళను అసలు పట్టించుకోక పోయిన పర్వాలేదు అన్న చందంగా ఉంది పరిస్థితి. పట్టించుకోవటం అంటే కనీసం ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నట్లు తెలంగాణ లో సచివాలయంలోకి కూడా రానివ్వని పరిస్థితి. ఏ పత్రిక రిపోర్టర్ అయినా..ఛానెళ్ల ప్రతినిదులు అయినా కచ్చితమైన సమాచారం తెలుసుకోవటానికి ఉన్న మార్గం ఎక్కడ?. ప్రభుత్వ తీరు చుసిన తర్వాత ఐఏఎస్ లు కూడా అదే లైన్ లో ఉన్నారు. వాళ్ళు కూడా మీడియా ఫోన్లు ఎత్తరు. ఇక నిరుద్యోగ యువత పరిస్థితి అయితే మరింత దారుణం. టిఎస్ పీఎస్ సి లో జరిగిన తంతు అందరూ చూస్తున్నదే. ఇలా చెప్పుకుంటే పోతే ఆ జాబితా చాంతాడు అంత అవుతుంది. ఎవరికైనా జీవిత లక్ష్యం అంటే ఒకటే ఉంటుంది...కానీ సీఎం కెసిఆర్ లక్ష్యాలు అలా మారుతూ పోతున్నాయి అంటే తెలంగాణ సెంటిమెంట్ ను కెసిఆర్ తన రాజకీయ అవసరాలకు ఎలా వాడుకున్నారనే విషయన్ని ప్రజలు ఇప్పటికైనా గమనిస్తే బాగుంటుంది అని ఒక తెలంగాణ ఐఏఎస్ అధికారి వ్యాఖ్యానించారు.