Telugu Gateway
Telangana

మీ ఫోకస్ తెలంగాణ భవిత పై పెట్టండి

మీ ఫోకస్ తెలంగాణ భవిత పై పెట్టండి
X

ఎన్నికలు దగ్గర పడుతుండటంతో అన్ని పార్టీల్లోనూ రాజకీయ వేడి పెరుగుతోంది. నాయకుల పార్టీ మార్పు వార్తలు కూడా పెద్ద ఎత్తున హల్చల్ చేస్తున్నాయి. కొద్ది రోజులుగా వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వై ఎస్ షర్మిల తన పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి...ఆ పార్టీలో చేరతారని...ఆమెకు కర్ణాటక నుంచి రాజ్య సభ సీట్ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. అందుకు ఆమె ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ సారధ్య బాధ్యతలు తీసుకోవాలని కోరినట్లు బలంగా ప్రచారం సాగింది. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ నుంచి వై ఎస్ షర్మిలను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కడప నుంచి బరిలో దింపే అవకాశం ఉంది అంటూ కూడా రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. వీటి అన్నింటిపై వై ఎస్ షర్మిల ఒక ట్వీట్ ద్వారా క్లారిటీ ఇచ్చారు. షర్మిల ట్వీట్ సారాంశం ఇలా ఉంది.

‘ వైఎస్ షర్మిల రెడ్డి తన చివరి శ్వాస వరకు తెలంగాణ బిడ్డగా.. తెలంగాణ కొరకు పోరాడుతూనే ఉంటది ఊహాజనిత కథలు కల్పిస్తూ, నాకు,తెలంగాణ ప్రజలమధ్య అగాధాన్ని సృష్టించే విఫల యత్నాలు జరుగుతున్నాయి పనిలేని,పసలేని దార్శనికులకు నేను చెప్పేది ఒకటే నా రాజకీయ భవిత మీద పెట్టె దృష్టిని, సమయాన్ని కేసీఅర్ పాలనపై పెట్టండి అన్నివిధాలుగా కేసీఆర్ సర్కారు పాలనలో.. సర్వనాశనమైపోతున్న తెలంగాణ భవితమీద పెట్టండి కేసీఆర్ కుటుంబం అవినీతిని ఎండగట్టండి నా భవిష్యత్తు తెలంగాణతోనే.. తెలంగాణలోనే, నా ఆరాటం, నా పోరాటం తెలంగాణ కోసమే జై తెలంగాణ’ అంటూ ముగించారు.

Next Story
Share it