Telugu Gateway
Telangana

దొరాదిపత్య దుర్మార్గ పాలనపై పోరాటం

దొరాదిపత్య దుర్మార్గ పాలనపై పోరాటం
X

దుబ్బాక ఎన్నికల ఫలితంపై కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్ పర్సన్ విజయశాంతి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో దొరాధిపత్య దుర్మార్గ పాలనకు మలి దశ ఉద్యమం ప్రారంభానికి దుబ్బాక ప్రజలు ఊపిరి ఊదారన్నారు. ఆమె ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. 'టీఆర్ఎస్ అహంకారపూరిత ధోరణులకు... కేసీఆర్ దొర నిరంకుశ పోకడలకు జవాబు దుబ్బాక తీర్పు. అధికార పార్టీ ప్రలోభాలకు దుబ్బాక ఓటర్లు ప్రభావితం కాకుండా పాలకులపై గూడు కట్టుకున్న వ్యతిరేకతను తమ ఓటుతో స్పష్టం చేశారు. ఓటమిపై సమీక్షించుకుంటామని టీఆర్ఎస్ అంటోంది.

ఈ ఉపఎన్నిక సందర్భంగా టీఆర్ఎస్ నాయకుల వ్యాఖ్యల్ని గుర్తు చేసుకోవాలి. దుబ్బాకలో టీఆర్ఎస్ లక్ష ఓట్ల మెజారిటీ ఖాయమని... బీజేపీ, కాంగ్రెస్‌లకు కనీసం డిపాజిట్లు వస్తాయా? అని మొదట వ్యాఖ్యానించి.... ఆ తర్వాత దుబ్బాకలో ఒక్క ఓటుతో గెలిచినా గెలుపేనన్నారు. లక్ష మెజారిటీ ఆశించి... ఒక్క ఓటుతో గెలుపు చాలనుకునే దుస్థితికి రోజుల వ్యవధిలోనే ఎందుకు దిగజారాల్సి వచ్చిందో ముందు దానిపై సమీక్షించుకోండి. ప్రజలు మీరేం చెబితే అది నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోండి.' అని వ్యాఖ్యానించారు.

Next Story
Share it