వెంకయ్యనాయుడికి మళ్లీ కరోనా
BY Admin23 Jan 2022 11:36 AM GMT
X
Admin23 Jan 2022 11:36 AM GMT
ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మరోసారి కరోనా బారిన పడ్డారు.ప్రస్తుతం హైదరాబాద్ పర్యటనలో ఉన్న ఆయన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు ఢిల్లీ బయలుదేరటానికి ముందు ఆయనకు కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడుకి కోవిడ్ పాజిటివ్ నిర్ధారణ అయ్యింది. వైద్యుల సూచన మేరకు వారం రోజుల పాటు వారు స్వీయ నిర్బంధంలో ఉండనున్నారు. ఇటీవల తనను కలసిన వారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ట్విట్టర్ ద్వారా కోరారు. 2020 సెప్టెంబర్ లోనూ ఆయన కరోనా బారిన పడ్డారు.
Next Story