Telugu Gateway
Telangana

తెలంగాణ‌లో ఆర్టీసీ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం

తెలంగాణ‌లో ఆర్టీసీ చార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం
X

అమాంతం పెరిగిన డీజిల్ ధ‌ర‌ల భారం త్వ‌ర‌లోనే ప్ర‌యాణికుల‌పై ప‌డ‌నుంది. తెలంగాణ ప్ర‌భుత్వం ఈ మేర‌కు ఆర్టీసీ ఛార్జీల పెంపు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేసింది. ముఖ్య‌మంత్రి కేసీఆర్ అనుమతి లభించిన తర్వాత వెంటనే కొత్త చార్జీలు అమలులోకి రానున్నాయి. ఆర్టీసీ చార్జీల పెంపుపై ఆదివారం నాడు సమావేశం ముగిసింది. సమావేశానంతరం ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ మీడియాతో ఆర్టీసీ చార్జీలు పెంచక తప్పదని స్పష్టం చేశారు. చార్జీల పెంపుపై సీఎం కేసీఆర్‌కు మరోసారి ప్రతిపాదనలు పంపిస్తున్నామని ప్రకటించారు.

ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో ఉన్నందున చార్జీల పెంపు నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. డీజిల్ ధరలు భారీగా పెంచడం వల్లే ఆర్టీసీ తీవ్ర నష్టాల్లోకి వెళ్లిందన్నారు. పల్లె వెలుగు బస్సులకు కిలోమీటర్‌కు 25 పైసలు, ఎక్స్‌ప్రెస్‌ సర్వీసులకు కిలోమీటర్‌కు 30 పైసలు, సిటీ, ఆర్డినరీ బస్సులకు కిలోమీటరకు 25 పైసలు, మెట్రో డీలక్స్‌ బస్సులకు కిలోమీటరుకు 30 పైసలు పెంచాలని ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఆమోదం తర్వాత అధికారికంగా ఆర్టీసీ ప్రకటించే అవ‌కాశం ఉంది.

Next Story
Share it