Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్

టీఆర్ఎస్ నుంచి కుంట శ్రీనివాస్ సస్పెండ్
X

తెలంగాణలో కలకలం సృష్టించిన ఇద్దరు హైకోర్టు న్యాయవాదుల దారుణ హత్య వ్యవహారంపై అధికార తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) స్పందించింది. ఈ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ మంథని పార్టీ మండల అధ్యక్షుడు కుంట శ్రీనివాస్ ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ఆదేశాలు వెలువడ్డాయి. వామనరావు దంపతుల హత్య కేసులో ఆయన పేరు ఎఫ్ఐఆర్ లో కూడా ఉంది.

ఈ హత్య జరిగినప్పటి నుంచి కుంట శ్రీనివాస్ పేరే ప్రముఖంగా విన్పించింది. వామనరావు దంపతుల హత్య కేసులో ఏ1గా వెల్ది వసంతరావు, ఏ2గా కుంట శ్రీనివాస్, ఏ3గా అక్కపాక కుమార్ ల పేర్లు ఉన్నాయి. వీరిని మహారాష్ర్, సరిహద్దుల్లో అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి హత్యకు సంబంధించిన సమాచారం రాబడుతున్నారు పోలీసులు.

Next Story
Share it