కెసీఆర్ కమ్యూనిస్టులను కలుపుకునేంత వీక్ అయిపోయారా?!
ఇప్పుడు తనకు అవసరం ఉంది కాబట్టి ప్రగతి శీల శక్తులు..క్రియాశీల శక్తులు ఏకం కావాలంటూ కొత్త నినాదం అందుకున్నారు. ఇతర పార్టీలు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటే అవి ఫిరాయింపులు..అక్రమాలు..అదే టీఆర్ఎస్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను చేర్చుకుంటే మాత్రం అది రాజకీయ ఏకీకరణ. తనకు అనుగుణంగా కొత్త కొత్త సూత్రీకరణలు చేయటంలో కెసీఆర్ ను మించిన వారు లేరని చెప్పొచ్చు. మునుగోడు ఉప ఎన్నికలోనే కాదు..భవిష్యత్ లోనూ టీఆర్ఎస్, సీపీఎం, సీపీఐలు కలసి ఉంటాయన్నారు. కెసీఆర్ బహిరంగ సభ ద్వారా రైతులను. ఇతర వర్గాలను భయపెట్టే ప్రయత్నం చేశారనే చెప్పొచ్చు. ఎలా అంటే ఒక్క ఉప ఎన్నికలో గెలిస్తేనే బిజెపి తెలంగాణలో రైతులతో మీటర్లు పెట్టించగలదా.. అది సాధ్యం అవుతుందా?. అంటే ఖచ్చితంగా కాదని చెప్పొచ్చు. కానీ బిజెపికి ఓటు పడ్డది అంటే మన బాయి కాడ మీటర్ పడుతుంది అని రైతులను కెసీఆర్ హెచ్చరించారు. ఇది పార్టీల ఎన్నిక కాదు..ఓటర్లు అందరూ టీఆర్ఎస్ వైపే చూడాలన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేస్తే వేస్ట్ అవుతుందని ప్రకటించారు. దేశం నుంచి బిజెపిని తరిమికొడితేనే మనం ముందుకు పోతాం అని ప్రకటించారు. ఈడీలు తనను ఏమీ చేయలేవంటూ ఏం పీక్కుంటావో పీక్కో అంటూ సవాల్ విసిరారు