Telugu Gateway
Telangana

టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్

టీఆర్ఎస్ ఎమ్మెల్యే షాకింగ్  కామెంట్స్
X

ప్రజలకు మంచి చేస్తే అర్ధం కావటం లేదు

ఎన్నికల ఏడాది ముందు అన్నీ ఇస్తే సరిపోతుంది

అధికార టీఆర్ఎస్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాజీ మంత్రి కూడా. ప్రజలకు తాము చేస్తున్న మంచి అర్ధం కావటం లేదన్నారు. '24 గంటల ఉచిత విద్యుత్ కాకుండా కేవలం 3,4 గంటల కరెంటు ఇవ్వాలని సీఎం ను కోరతానని వెల్లడించారు. మేము చేస్తున్న మేలు సామాన్యులకు అర్థం కావడంలేదు. జనం మంచివారు అనాలా .. అమాయకులనాలో తెలియడంలేదు. పనికిమాలిన భావాలకు లోనవుతున్నారని వ్యాఖ్యానించారు.

ఇప్పుడు సంక్షేమ పథకాలను ఆపేసి ఎన్నికలు ఏడాది ఉన్నాయనగా మళ్లీ ప్రారంభిస్తే బాగుంటుంది' అంటూ లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. జనాలకు మంచిచేస్తే మరిచిపోయే అలవాటుందని, ఏడాదిపాటు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను రద్దు చేయాలని కేసీఆర్‌ను కోరాలని ఉందన్నారు. మహబూబ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల పట్టణంలో నూతనంగా ఏర్పాటు చేసిన పట్టణ ప్రకృతి వనం ప్రారంభోత్సవం సందర్భంగా లక్ష్మారెడ్డి ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Next Story
Share it