Telugu Gateway
Telangana

హుజూరాబాద్ లో గొప్ప విజ‌యం సాధించ‌బోతున్నాం

హుజూరాబాద్ లో గొప్ప విజ‌యం సాధించ‌బోతున్నాం
X

హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల పోలింగ్ ముగిసిన అనంత‌రం ఇక్క‌డ ప్ర‌చార బాధ్య‌త‌లు అంతా తానై నిర్వ‌హించిన మంత్రి హ‌రీష్ రావు స్పందించారు. ఈ మేర‌కు ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. 'హుజురాబాద్ ఉప ఎన్నికల్లో ఓటర్లు చైతన్యాన్ని చాటారు. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ప్రతి ఒక్కరు పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం వారి చైతన్యానికి నిదర్శనం.' అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకున్న ఓటర్లకు ధన్యవాదాలు తెలిపారు.

గత 4 నెలలుగా పార్టీ గెలుపు కోసం పార్టీ నేతలు, కార్యకర్తలు ఎంతో కష్టపడ్డారు. వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ..టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ మార్గదర్శకంతో , హుజురాబాద్ ప్రజల ఆశీర్వాదం తో గొప్ప విజయం సాధించబొతున్నామన్నారు.. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు సహకరించిన పార్టీ కార్యకర్తలకు అభినందనలు తెలిపారు.

Next Story
Share it